ETV Bharat / bharat

భాజపాకు కుమారస్వామి తీవ్ర హెచ్చరిక

తమ పార్టీ భాజపాలో కలవబోతుందంటూ కమలదళం దుష్ప్రచారం చేస్తోందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్​డీ కుమారస్వామి మండిపడ్డారు. జేడీఎస్​తో జాగ్రత్తగా ఉండాలని భాజపాను ట్విట్టర్​ ద్వారా హెచ్చరించారు.

author img

By

Published : Jan 3, 2021, 10:56 PM IST

H D Kumaraswamy warned the BJP to beware of JD(S)
జేడీఎస్​తో జాగ్రత్త : ఆ పార్టీకి కుమారస్వామి హెచ్చరిక

భాజపాపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్​డీ కుమారస్వామి తీవ్ర విమర్శలు చేశారు. తమ పార్టీ.. భాజపాతో పొత్తు పెట్టుకుంటోందంటూ అసత్య ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. జేడీఎస్​కు భాజపా స్నేహం అవసరం లేదని, రాష్ట్రాభివృద్ధి కావాలని స్పష్టం చేశారు. జేడీఎస్​తో జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశారు.

ఇటీవల జరిగిన కర్ణాటక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీని అంతం చేయాలని భాజపా చూసిందని.. కానీ అది సాధ్యం కాలేదన్నారు కుమారస్వామి. దీంతో జేడీఎస్ తమతో పొత్తుపెట్టుకుంటోందంటూ అసత్య ప్రచారాలు చేస్తోందని భాజపాపై ట్విట్టర్​ వేదికగా ధ్వజమెత్తారు.

"నాకు కర్ణాటకలోని భాజపా నాయకులకంటే ప్రధాని మోదీతోనే సత్సంబంధాలు ఉన్నాయి. చాలామంది మా పార్టీతో స్నేహంగా ఉండి పార్టీని విడదియ్యాలని చూశారు. ఇప్పుడు అది భాజపా వంతు."

--హెచ్​డీ కుమారస్వామి, జేడీఎస్ నేత

భాజపాతో పొత్తుపెట్టుకుంటున్నామని తమ పార్టీ నుంచి ఎవరు అన్నారో చెప్పాలని డిమాండ్​ చేశారు మాజీ ముఖ్యమంత్రి. ఇలాంటి అసత్య ప్రచారాలతో జేడీఎస్​ కార్యకర్తల్లో విషం నింపాలని భాజపా చూస్తోందని మండిపడ్డారు. ఇవి అనైతిక రాజకీయాలని ఆ పార్టీ గుర్తుంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా తన తండ్రి దేవెగౌడ ప్రధానమంత్రి పదవి నుంచి వైదొలిగే సమయంలోనూ అప్పటి భాజపా నాయకులు వాజ్​పేయీ ఇచ్చిన మద్దతును స్వీకరించలేదని గుర్తు చేశారు.

ఇదీ చదవండి : ఆ ఒక్కరినీ నియమిస్తే 25 హైకోర్టులకు సీజేలున్నట్లే..

భాజపాపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్​డీ కుమారస్వామి తీవ్ర విమర్శలు చేశారు. తమ పార్టీ.. భాజపాతో పొత్తు పెట్టుకుంటోందంటూ అసత్య ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. జేడీఎస్​కు భాజపా స్నేహం అవసరం లేదని, రాష్ట్రాభివృద్ధి కావాలని స్పష్టం చేశారు. జేడీఎస్​తో జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశారు.

ఇటీవల జరిగిన కర్ణాటక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీని అంతం చేయాలని భాజపా చూసిందని.. కానీ అది సాధ్యం కాలేదన్నారు కుమారస్వామి. దీంతో జేడీఎస్ తమతో పొత్తుపెట్టుకుంటోందంటూ అసత్య ప్రచారాలు చేస్తోందని భాజపాపై ట్విట్టర్​ వేదికగా ధ్వజమెత్తారు.

"నాకు కర్ణాటకలోని భాజపా నాయకులకంటే ప్రధాని మోదీతోనే సత్సంబంధాలు ఉన్నాయి. చాలామంది మా పార్టీతో స్నేహంగా ఉండి పార్టీని విడదియ్యాలని చూశారు. ఇప్పుడు అది భాజపా వంతు."

--హెచ్​డీ కుమారస్వామి, జేడీఎస్ నేత

భాజపాతో పొత్తుపెట్టుకుంటున్నామని తమ పార్టీ నుంచి ఎవరు అన్నారో చెప్పాలని డిమాండ్​ చేశారు మాజీ ముఖ్యమంత్రి. ఇలాంటి అసత్య ప్రచారాలతో జేడీఎస్​ కార్యకర్తల్లో విషం నింపాలని భాజపా చూస్తోందని మండిపడ్డారు. ఇవి అనైతిక రాజకీయాలని ఆ పార్టీ గుర్తుంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా తన తండ్రి దేవెగౌడ ప్రధానమంత్రి పదవి నుంచి వైదొలిగే సమయంలోనూ అప్పటి భాజపా నాయకులు వాజ్​పేయీ ఇచ్చిన మద్దతును స్వీకరించలేదని గుర్తు చేశారు.

ఇదీ చదవండి : ఆ ఒక్కరినీ నియమిస్తే 25 హైకోర్టులకు సీజేలున్నట్లే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.